
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ‘గల్లి స్టెప్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘ఓ మెరుపులా చిందులే వేయారా’ అంటూ కొనసాగే ఈ పాటను కథానాయకుడు సుహాస్ ఆలపించడం విశేషం. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీత దర్శకుడు రథన్ స్వరాలు అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ”సుహాస్ ఆలపించిన ఈ మాస్ సాంగ్ నేటి ట్రెండ్కు తగిన విధంగా ఉంటుంది. ప్రతి గల్లిలో తీన్మార్ సాంగ్లా ఈ సాంగ్ సన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది. హీరో సుహాస్, మాళవిక మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది. జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్టైనింగ్గా రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది” అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ “నిర్మాత హరీష్ కథ చెప్పగానే క్వాలిటీగా తీద్దామని చెప్పాడు. ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ప్రొడక్ట్ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్ఫుల్గా మలిచాడు.రథన్ ఈ లవ్స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్గా ఉంటాయి” అన్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు.