
సూపర్ హీరోగా తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో తేజ సజ్జా, తన తాజా చిత్రం ‘మిరాయ్’తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సంచలన విజయం సాధించింది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ, రెండో వారంలోనూ థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పెడుతూ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.
‘మిరాయ్’ చిత్రం అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల మార్క్ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘హనుమాన్’ విజయం తర్వాత వరుసగా రెండో చిత్రంతో ఈ అద్భుత ఫీట్ను సాధించిన తేజ సజ్జా, అమెరికాలో ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత ఈ స్థాయి విజయాన్ని అందుకున్న హీరోగా నిలిచాడు. ఎన్టీఆర్, ప్రభాస్లు ఎన్నో సినిమాల తర్వాత ఈ ఘనత సాధించగా, తేజ సజ్జా తన కెరీర్ ప్రారంభ దశలోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’లో రితిక నాయక్, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం, 200 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. తేజ సజ్జా కెరీర్లో అతిపెద్ద బ్లాక్బస్టర్గా ‘మిరాయ్’ నిలవనుంది.
తేజ సజ్జా ఈ స్థాయి విజయంతో యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘మిరాయ్’ సక్సెస్తో అతని ఖ్యాతి మరింత పెరిగింది, మరిన్ని బ్లాక్బస్టర్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


