
ప్రముఖ నటి హేమ తనపై ఉన్న కేసును బెంగళూరు హైకోర్టు క్వాష్ చేసి, తాను నిర్దోషిణి అని తీర్పు ఇచ్చింది. నవంబర్ 3న వచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇప్పుడు చేతికి అందినందున, ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు.
సోషల్ మీడియాలో తనపై జరిగిన దుష్ప్రచారం వల్ల తీవ్ర మనోవేదనకు గురైనట్టు హేమ వెల్లడించారు. ఈ బాధతో తన తల్లి చనిపోయారని, గత సంవత్సరంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏమీ చేయలేదని చెప్పినా, కొందరు అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని హేమ తెలిపారు.


