
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రముఖ హీరో సుమన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా దోషులను గుర్తించాలన్నారు.
భవిష్యత్తులో వారికి అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాను కోరారు.


