వ్యవసాయ భూమి పేరుతో దర్శకుడు శ్రీను వైట్లకు మోసం

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఇతరులకు చెందిన భూమిని శ్రీను వైట్లకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూమిగా చూపిస్తూ ఆ స్థలాన్ని విక్రయించగా, దీనికి సంబంధించి శ్రీను వైట్ల సుమారు రూ. కోటి వరకు చెల్లించినట్లు సమాచారం.
అయితే ఇటీవల కోర్టు విచారణలో ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదని తేలడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తమను మోసం చేసి ఇతరుల స్థలాన్ని అమ్మినట్లు గుర్తించిన శ్రీను వైట్ల ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ ఘటనపై దర్శకుడు శ్రీను వైట్ల హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం వెనుక మరెవరు ఉన్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Related Articles

Latest Articles