మద్యం మత్తులో హల్చల్ చేసిన రాజతరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

టాలీవుడ్ హీరో రాజతరుణ్ మాజీ ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన లావణ్య తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి జిల్లా మల్లేపల్లి గ్రామంలో మద్యం మత్తులో ఆమె హల్చల్ చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం, లావణ్య మద్యం సేవించి కారును నడుపుతూ ఒక బైక్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆగకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లావణ్యకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆమె కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటన సమయంలో లావణ్యతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.

Related Articles

Latest Articles