శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ నారా లోకేష్‌లను కలిసి వివాహానికి ఆహ్వానించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్‌లను కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, వారి జీవితంలోని ఈ ప్రత్యేకమైన కలయికకు అపూర్వ వేదికగా నిలుస్తుంది.

Related Articles

Latest Articles