కావేరీ వ్యాఖ్యల వివాదం.. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు, రాజకీయ దుమారం

తమిళనాడులో కావేరీ జలాల వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రముఖ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే తాను త్రిషను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కావేరీ సమస్య గురించే మాట్లాడానని ఉదయనిధి వివరణ ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని టీవీకే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
మరోవైపు ఉదయనిధి నివాసం ఎదుట నటుడు విజయ్ అభిమానులు నిరసన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Related Articles

Latest Articles