
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి గారు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం నుంచి పవన్ కల్యాణ్ వెంటనే బయలుదేరి హైదరాబాద్కు వెళ్లనున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది. పవన్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.