
తన వద్ద 10 ఏనుగు దంతాలు, వాటితో చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని మోహన్ లాల్ ప్రకటించారు. కేరళం అటవీ శాఖ ఇచ్చిన క్షమాభిక్ష కార్యక్రమంలో భాగంగా ఈ వివరాలను తెలిపారు. 2011లో కొచ్చిలోని ఆయన ఇంట్లో జరిగిన IT సోదాల్లో దంతాలు బయటపడ్డాయి. ఇవి తనకు వారసత్వంగా, గిఫ్టులుగా వచ్చాయని ఆయన చెప్పారు. వన్యప్రాణి సంబంధ వస్తువుల విషయం తనకు తెలియదన్నారు. దీంతో ప్రభుత్వం కేసు ఉపసంహరణకు సిద్ధమవగా కోర్టు తిరస్కరించింది.


